పరశురామ్ డైరెక్షన్ లో టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తున్న 'సర్కారు వారి పాట' సినిమా మే 12న భారీ ఎత్తున విడుదలకు సిద్ధమైంది. ఈ సినిమాలో మహేష్ సరసన కీర్తి సురేష్ జంటగా నటిస్తుంది. 'సర్కారు వారి పాట' ప్రీ-రిలీజ్ ఈవెంట్ ఈ నెల 7న గ్రాండ్ గా జరగనుంది. మే 7వ తేదీన హైదరాబాద్ యూసుఫ్గూడ పోలీస్ గ్రౌండ్స్లో ఈ కార్యక్రమం జరగనుంది అని సమాచారం. తాజా రిపోర్ట్స్ ప్రకారం, ఈ ప్రీ-రిలీజ్ ఫంక్షన్కు డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాధ్ అతిధిగా హాజరవుతారని వార్తలు వినిపిస్తున్నాయి. ఇప్పుడు ఆన్లైన్లో ఈ వార్తా చక్కర్లు కొడుతోంది. సుబ్బరాజు, వెన్నెల కిషోర్ తదితరులు కీలక పాత్రలో కనిపించనున్నారు. బ్యాంకింగ్ స్కామ్ ఆధారంగా తెరకెక్కుతున్న ఈ సినిమాకి తమన్ సంగీతం సమకూరుస్తున్నాడు. GMB ఎంటర్టైన్మెంట్, మైత్రీ మూవీ మేకర్స్ మరియు 14 రీల్స్ ప్లస్ 'సర్కారు వారి పాట' సినిమాని నిర్మిస్తున్నాయి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa