ఇషాన్ సూర్య దర్శకత్వంలో మంచు విష్ణు ఒక క్రేజీ ప్రాజెక్ట్ చేస్తున్నట్లు అధికారకంగా ప్రకటించిన సంగతి అందరికి తెలిసిందే. ఈ సినిమాకి మూవీ మేకర్స్ ఇంకా టైటిల్ ని లాక్ చేయలేదు. ఈ సినిమాలో పాయల్ రాజ్పుత్, సన్నీలియోన్ కథానాయికలుగా నటిస్తున్నారు. తాజా సమాచారం ప్రకారం, డైనమిక్ కొరియోగ్రాఫర్ ఇండియన్ మైఖేల్ జాక్సన్ ప్రభుదేవా ఈ సినిమాలో ఒక పాటకు కొరియోగ్రఫీ చేస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం రామోజీ ఫిల్మ్ సిటీలో విష్ణు, పాయల్ రాజ్పుత్లపై ఒక స్పెషల్ సాంగ్ ని చిత్రీకరిస్తున్నారు. చాలా కాలం తర్వాత ప్రభుదేవా ఈ సినిమాతో తిరిగి TFIకి వస్తున్నారు. అనూప్ రూబెన్స్ ఈ సినిమాకి సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రాన్ని ఏవీఏ ఎంటర్టైన్మెంట్ నిర్మిస్తోంది. ఈ చిత్రానికి సంబంధించిన మరిన్ని వివరాలు రానున్న రోజుల్లో మూవీ మేకర్స్ ప్రకటించనున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa