ట్రెండింగ్
Epaper    English    தமிழ்

నాపై చేతబడి చేశారు: బాలీవుడ్ హీరోయిన్

cinema |  Suryaa Desk  | Published : Thu, May 05, 2022, 04:42 PM

బాలీవుడ్ స్టార్ హీరో శత్రుఘ్న సిన్హాపై హీరోయిన్ పూజా మిశ్రా సంచలన ఆరోపణలు చేసింది. శత్రుఘ్న సిన్హా, అతడి భార్య పూనమ్ సిన్హా కలిసి తనను బాలీవుడ్‌లో ఎదనీయకుండా చేశారని చెప్పింది. తనపై వారిద్దరూ చేతబడి చేశారని, అవకాశాలు పెరుగుతున్న క్రమంలో సెక్స్ స్కాండల్‌లో ఇరికించారని ఆరోపించింది. ఇటీవల ఓ టీవీ ఛానల్ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేసింది. శత్రుఘ్నసిన్హా దంపతులు చేసిన చేతబడి వల్ల తాను తరచూ స్పృహ కోల్పోతున్నానని, ఏం చేస్తున్నానో కూడా తెలియడం లేదని వాపోయింది. 17 ఏళ్లుగా వారిద్దరూ తనను వేధిస్తున్నారని, తన సినీ కెరీర్‌ను మొత్తం నాశనం చేశారని ఆవేదన వ్యక్తం చేసింది. తన తండ్రి, శత్రుఘ్న సిన్హా ఒకప్పుడు మంచి స్నేహితులని తెలిపింది. దానిని అడ్డం పెట్టుకుని, తన ఎదుగుదలకు సహకరిస్తున్నట్లు నటిస్తూ, తన జీవితాన్ని అధోగతిపాలు చేశారని పేర్కొంది.


శత్రుఘ్న సిన్హా కుమార్తె సోనాక్షి సిన్హా కేవలం ఫ్యాషన్ డిజైనర్‌గా ఉండిపోవాలనుకుందని, ఆమెను పైకి తీసుకురావడం కోసం తనను తొక్కేశారని పూజా మిశ్రా తెలిపింది. మొత్తం 35 సినిమాలలో తాను నటించాల్సి ఉండగా, వాటిలో తాను నటించకుండా అడ్డుకున్నారని వెల్లడించింది. ఓ సారి శత్రుఘ్న సిన్హా పుట్టిన రోజున విషెస్ చెప్పేందుకు వెళ్లగా, అప్పుడు కేక్‌లో ఏదో కలిపి ఇచ్చారని పేర్కొంది. అది తినగానే తనపై బ్లాక్ మ్యాజిక్ చేసి, వారి వశం చేసుకున్నారని తెలిపింది. తాను విదేశాల నుంచి తెచ్చుకున్న ఖరీదైన వస్తువులు సైతం కాజేశారని తెలిపింది. ఇక పూజా మిశ్రా బిగ్‌బాస్-5 సీజన్‌ ద్వారా పాపులర్ అయింది. మోడల్‌గా తన కెరీర్‌ను ప్రారంభించి, కొన్ని సినిమాలలో నటించింది. ప్రస్తుతం ఈమె చేసిన ఆరోపణలు సంచలనంగా మారాయి. పలువురు వాటిలో నిజం లేదని కొట్టి పారేస్తున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa