నాచురల్ స్టార్ నాని, కీర్తి సురేష్ రెండోసారి జంటగా నటిస్తున్న చిత్రం దసరా. అంతకుముందు నేను లోకల్ మూవీ లో వీరిద్దరూ కలిసి నటించగా ఆ మూవీ సూపర్ హిట్ అయింది. అయితే నేను లోకల్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా తెరకెక్కితే, దసరా యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతోంది.
శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో రూపొందుతున్న ఈ మూవీ బొగ్గుగనుల నేపథ్యంలో గోదావరిఖనిలో జరిగే కథతో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇటీవలనే ఈ సినిమా కొత్తగూడెం సింగరేణి బొగ్గుగనుల్లో ఒక షెడ్యూల్ ను పూర్తి చేసుకుంది. దాదాపు 1000 మంది డ్యాన్సర్లతో, జూనియర్ ఆర్టిస్టులతో ఒక గ్రాండ్ సాంగ్ ను కూడా అక్కడే చిత్రీకరించారు. ఈ మేరకు అంత చిన్న ఊళ్ళో వెయ్యికిపైగా ఉన్న నటీనటులకు వసతులు కల్పించటం నిర్మాతలకు కత్తిమీద సాము లాగా మారింది. దీంతో బొగ్గుగనుల్లో చిత్రీకరించాల్సిన మిగిలిన కీలక సన్నివేశాల కోసం, హైదరాబాద్ నగర శివార్లలో సింగరేణి బొగ్గుగనుల సెట్ వేస్తున్నారట ఆర్ట్ డైరెక్టర్స్. ఇందుకోసం దసరా మూవీ నిర్మాతలు భారీగానే ఖర్చు పెడుతున్నారని టాక్. ఇంత అవసరమేముంది? ఒరిజినల్ ప్లేస్ లోనే షూట్ చేసుకోవచ్చుగా? అనుకుంటున్నారా.... బొగ్గుగనుల్లో వాతావరణం చాలా వేడిగా ఉంటుంది. అందునా వేసవి కలం అవడంతో చిత్రయూనిట్ ఆరోగ్య దృష్ట్యా నిర్మాతలు ఈ నిర్ణయం తీసుకున్నారట. రాత్రి, పగలు అనే తేడా లేకుండా ఆ సెట్ లో నిరంతర షూట్ చెయ్యనున్నారట. దసరా సినిమాతో నాని మొదటిసారిగా పాన్ ఇండియా బరిలోకి దిగగున్నాడు. శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ పతాకంపై సుధాకర్ చెరుకూరి ఈ మూవీ నిర్మిస్తున్నారు. సంతోష్ నారాయణ్ సంగీతం అందిస్తున్నారు. మార్చి నెలలో విడుదలైన ఈ మూవీ గ్లిమ్ప్స్ కు ప్రేక్షకుల నుండి మంచి ఆదరణ దక్కింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa