ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఫ్యాన్స్ కు మహేష్ ప్రత్యేక లేక... థియేటర్లలోనే చూడండంటూ మనవి...

cinema |  Suryaa Desk  | Published : Sat, May 07, 2022, 09:04 PM

టాలీవుడ్ సూపర్‌ స్టార్‌ మహేశ్‌బాబు ప్రధాన పాత్రలో నటించిన మాస్‌ ఎంటర్‌టైనర్‌ సర్కారువారి పాట. పరశురామ్‌ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో కీర్తి సురేశ్‌ కథానాయికగా నటించింది. ఇప్పటికే టీజర్‌, ట్రైలర్‌, సాంగ్స్‌తో సోషల్‌ మీడియాను షేక్‌ చేసిన యూనిట్‌ నేడు ప్రీరిలీజ్‌ ఈవెంట్‌ జరపబోతోంది. అందరూ ఈ ఈవెంట్ కోసం ఎదురుచూస్తుంటే మహేష్ తన ఫ్యాన్స్ ను సర్ప్రైజ్ చేస్తూ ఒక లేఖను రాసాడు. ఈ మూవీకి సంబంధించిన అన్ని విషయాలను వివరించిన తర్వాత థియేటర్లలోనే చూడండంటూ అభిమానులను మహేష్ కోరాడు. తన తదుపరి చిత్రంపై కూడా మహేష్ క్లారిటీ ఇచ్చాడు. త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌ దర్శకత్వంలో ఎస్‌ రాధాకృష్ణ నిర్మించే చిత్రం రెగ్యులర్‌ షూటింగ్‌ జూన్‌లో మొదలవుతుందని తెలిపాడు. భారీ అంచనాల నడుమ సర్కారువారిపాట చిత్రం మే 12న విడుదల కానుంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa