ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఎట్టకేలకు కూతురిని చూపించిన మాజీ విశ్వసుందరి

cinema |  Suryaa Desk  | Published : Mon, May 09, 2022, 12:39 PM

మాజీ విశ్వసుందరి, ప్రముఖ బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ప్రియాంక చోప్రా ఎట్టకేలకు తన గారాల పట్టిని ప్రేక్షకులకు పరిచయం చేసింది. బాలీవుడ్ తో పాటు హాలీవుడ్లోనూ పలు ప్రఖ్యాత సినిమాల్లో నటిస్తూ గ్లోబల్ గా మంచి పేరు తెచ్చుకుంటున్న ప్రియాంక, అమెరికన్ యాక్టర్ కమ్ సింగర్ నిక్ జోనస్ ను 2018 లో వివాహం చేసుకుంది. ఈ ఏడాది జనవరిలో ఈ దంపతులు సరోగసీ విధానం ద్వారా ఒక బుజ్జి పాపాయిని తమ జీవితాల్లోకి ఆహ్వానించారు. ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా, అధికారికంగా ప్రకటించిన ఈ దంపతులు అప్పటినుండి తమ గారాల పట్టీ గురించి ఎలాంటి అప్డేట్ ఇవ్వలేదు.  


ఇటీవలనే ప్రియాంక,నిక్ దంపతులు తమ ముద్దుల కూతురికి మాల్తీ మేరీ చోప్రా జోనస్ అని నామకరణం చేసినట్టు వార్తలు వచ్చాయి. ఎంతో పరిశోధించి మరీ ప్రియాంక తన బుజ్జాయికి ఈ పేరును సెలెక్ట్ చేసిందట. మాల్తీ అంటే చిన్న పువ్వు అని, మేరీ అంటే జీసస్ తల్లి మరియా అని, ఇక చివరిలో తమ ఇద్దరి ఇంటిపేర్లు కలిసి వచ్చేలా చోప్రా జోనస్ అని పెట్టినట్టు తెలుస్తుంది. 


తాజాగా మాతృదినోత్సవాన్ని పురస్కరించుకుని ప్రియాంక తన బుజ్జాయితో కలిసి దిగిన ఫోటోని సోషల్ మీడియాలో షేర్ చేసింది. దాదాపు 100రోజులకు పైగా NICU (నియోనాటల్ ఇంటెన్సివ్ కేర్ యూనిట్) లోనే ఉండిపోయిన ఈ బుజ్జాయిని నిన్ననే ప్రియాంక తన పొత్తిళ్లలోకి చేర్చుకున్నట్టు తెలుస్తోంది. ఈ ఫొటోలో ప్రియాంక, నిక్ జోనస్ లిద్దరూ కూడా తమ గారాలపట్టిని చూసుకుని తన్మయత్వంలో మునిగిపోయినట్టు కనిపిస్తారు. అయితే, ప్రియాంక బుజ్జాయి ఫేస్ ని మాత్రం పూర్తిగా రివీల్ చెయ్యలేదు. ఈ ఫొటోకు ఒక భావోద్వేగపూరిత నోట్ ను కూడా జత చేసింది. ప్రస్తుతం ఈ ఫోటో నెట్టింట తెగ వైరల్ అవుతుంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa