26/11 ముంబై దాడుల్లో వీర మరణం పొందిన మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ జీవితం ఆధారంగా తెరకెక్కిన చిత్రం 'మేజర్'. సందీప్ ఉన్నికృష్ణన్ పాత్రలో అడవి శేష్ నటించారు. శశి కిరణ్ టిక్కా దర్శకత్వం వహించారు. జూన్ 3న మేజర్ ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. తాజాగా మేజర్ ట్రైలర్ విడుద లైంది. దేశంమీద ప్రేమతో.. ఆర్మీలో అడుగుపెట్టిన ఓ యువకుడి కథ ఇది. తన జీవితం.. కుటుంబం, ప్రేమ, పెళ్లి.. వీటన్నింటికీ అతీతమైన దేశభక్తిని ఈ కథలో చూపించారు. ప్రకాష్ రాజ్ డైలాగులు ఉద్వేగంగా ఉన్నాయి. 'మైసన్ మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్. వెనకడుగు వేసే అవకాశం ఉంది. తప్పించుకునే దారి ఉంది. ముందుకెళ్తే చనిపోతాడని తెలుసు. అయినా వెళ్లాడు. చావు కళ్లలోకి చూసి నువ్వు నా జీవితాన్ని తీసుకెళ్లగలవు కానీ దేశాన్ని కాదు.. అన్నాడు..' అంటూ ఉద్వేగంగా చెప్పిన సంభాషణ గుండెల్ని పిండేశాలా ఉంది. ఇక ఈ సినిమాలో శోభితా ధూళిపాళ్లతో పాటు సయీ మంబ్రేకర్ కూడా మరో కథానాయికగా నటించింది. ప్రకాష్ రాజ్, రేవతి, మురళి శర్మ ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు. మహేష్ హోమ్ బేనర్ జీఎంబీ ప్రొడక్షన్స్ సోనీ పిక్చర్స్ తో కలిసి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. తెలుగుతో పాటు హిందీ, మలయాళంలో కూడా మేజర్ రిలీజ్ కానున్నాడు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa