టాలీవుడ్ సూపర్ స్టార్ నటించిన 'సర్కారు వారి పాట' సినిమా కోసం అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమా మే 12, 2022న గ్రాండ్గా విడుదల కానుంది. పరశురామ్ పెట్ల దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో మహేష్ సరసన కీర్తి సురేష్ జంటగా నటిస్తుంది. తాజా రిపోర్ట్స్ ప్రకారం, హైదరాబాద్ లో 'సర్కారు వారి పాట' సినిమా ప్రీ-సేల్స్ 2.5 కోట్ల మార్కును క్రాస్ చేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇప్పటివరకు ఈ సినిమా 2.51 కోట్లు వసూలు చేసింది. విడుదలకు మరో రెండు రోజుల సమయం ఉండటంతో హైదరాబాద్ లో ఈ సినిమా ఓపెనింగ్ డే కలెక్షన్స్ భారీగానే ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఇండియా మొత్తం మీద ఈ సినిమా అడ్వాన్స్ సేల్స్ 5.05 కోట్లకి చేరుకుంది. సుబ్బరాజు, వెన్నెల కిషోర్ తదితరులు ఈ యాక్షన్ ఎంటర్టైనర్లో కీలక పాత్రలో కనిపించనున్నారు. GMB ఎంటర్టైన్మెంట్, మైత్రీ మూవీ మేకర్స్ మరియు 14 రీల్స్ ప్లస్ ఈ సినిమాని నిర్మిస్తున్నాయి. థమన్ స్ ఈ సినిమాకి సంగీతం అందిస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa