పరశురామ్ డైరెక్షన్ లో టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తున్న 'సర్కారు వారి పాట' సినిమా మే 12న భారీ ఎత్తున విడుదలకు సిద్ధమైంది. ఈ సినిమాలో మహేష్ సరసన కీర్తి సురేష్ జంటగా నటిస్తుంది. ఈ యాక్షన్ ఎంటర్టైనర్లో సముద్రఖని, నదియా, సుబ్బరాజు, వెన్నెల కిషోర్ తదితరులు కీలక పాత్రలో కనిపించనున్నారు. ఇటీవల తాజాగా జరిగిన తెలుగు మీడియా ఇంటరాక్షన్లో టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు ఈ సినిమాలో మాస్ సాంగ్ 'మురారి బావ' పాట ఉండదని వెల్లడించారు. దాని స్థానంలో 'మా మ మహేశా' పాట ఉందని ఈ స్టార్ హీరో వెల్లడించారు. కొన్ని రోజుల తర్వాత యూట్యూబ్లో 'మురారి బావ' పాటను విడుదల చేయనున్నట్టు ఆయన ప్రకటించారు. బ్యాంకింగ్ స్కామ్ ఆధారంగా తెరకెక్కుతున్న ఈ సినిమాకి తమన్ సంగీతం సమకూరుస్తున్నాడు. GMB ఎంటర్టైన్మెంట్, మైత్రీ మూవీ మేకర్స్ మరియు 14 రీల్స్ ప్లస్ 'సర్కారు వారి పాట' సినిమాని నిర్మిస్తున్నాయి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa