పరశురామ్ డైరెక్షన్ లో టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తున్న 'సర్కారు వారి పాట' సినిమా మే 12న భారీ ఎత్తున విడుదలకు సిద్ధమైంది. ఈ సినిమాలో మహేష్ సరసన కీర్తి సురేష్ జంటగా నటిస్తుంది. ఈ యాక్షన్ ఎంటర్టైనర్లో సముద్రఖని, నదియా, సుబ్బరాజు, వెన్నెల కిషోర్ తదితరులు కీలక పాత్రలో కనిపించనున్నారు. తాజా రిపోర్ట్స్ ప్రకారం, USAలో ఈ సినిమా ప్రీ సేల్స్ $650K మార్కును క్రాస్ చేసినట్లు సమాచారం. ఈ సినిమా ప్రీమియర్లు ఈరోజు ప్రారంభమవుతాయి అని వార్తలు వినిపిస్తున్నాయి. ఇండియాలో కూడా సినిమా అడ్వాన్స్ బుకింగ్స్ మొదలయ్యాయి. బ్యాంకింగ్ స్కామ్ ఆధారంగా తెరకెక్కుతున్న ఈ సినిమాకి తమన్ సంగీతం సమకూరుస్తున్నాడు. GMB ఎంటర్టైన్మెంట్, మైత్రీ మూవీ మేకర్స్ మరియు 14 రీల్స్ ప్లస్ 'సర్కారు వారి పాట' సినిమాని నిర్మిస్తున్నాయి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa