టాలీవుడ్ యంగ్ హీరో రక్షిత్ శెట్టి చివరిసారిగా స్క్రీన్ పై 'అతడే శ్రీమన్నారాయణ' సినిమాలో కనిపించాడు. ఇప్పుడు తాజాగా '777 చార్లీ' అనే కొత్త సినిమాతో ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమవుతున్నాడు. కిరణ్రాజ్ కె దర్శకత్వం వహించిన ఈ సినిమా జూన్ 10, 2022న వివిధ భాషల్లో ఈ సినిమా థియేటర్లలో విడుదల కానుంది. ఈ చిత్రం తెలుగులో కూడా విడుదల కానుంది. లేటెస్ట్ అప్డేట్ ప్రకారం, '777 చార్లీ' తెలుగు వెర్షన్ థియేట్రికల్ ట్రైలర్ను మూవీ మేకర్స్ ఈరోజు విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. ఈ ట్రైలర్ను స్టార్ హీరో విక్టరీ వెంకటేష్, సాయి పల్లవి మరియు లక్ష్మి మంచు ఈరోజు మధ్యాహ్నం 12:12 గంటలకు విడుదల చేయనున్నట్లు ప్రొడక్షన్ హౌస్ ప్రకటించింది. చార్లీ, సంగీత, రాజ్ బి శెట్టి, డానిష్ సైత్, బాబీ సింహా తదితరులు ఈ సినిమాలో కీలక పాత్రలో కనిపించనున్నారు. జిఎస్ గుప్తా, రక్షిత్ శెట్టి నిర్మిస్తున్న ఈ చిత్రానికి నోబిన్ పాల్ సంగీతం అందించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa