పరశురామ్ పెట్ల దర్శకత్వంలో టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన 'సర్కారు వారి పాట' సినిమా ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదలైంది. ఈ సినిమా తొలి షోల నుండి మంచి వసూళ్లను రాబడుతోంది. ఈ సినిమాకి అభిమానులు, సినిమాప్రేమికులు అండ్ సెలబ్రిటీల నుంచి కూడా మంచి స్పందన వస్తోంది. ఈ సినిమాలో మహేష్ సరసన కీర్తి సురేష్ జంటగా నటిస్తుంది. సుబ్బరాజు, వెన్నెల కిషోర్ తదితరులు ఈ యాక్షన్ ఎంటర్టైనర్లో కీలక పాత్రలో కనిపించనున్నారు. తాజాగా ఇప్పుడు 'సర్కారు వారి పాట' సినిమా USAలో ఇప్పటివరకు 1.8 మిలియన్ డాలర్ల వసూళ్లు రాబట్టిందని తాజా సమాచారం. GMB ఎంటర్టైన్మెంట్, మైత్రీ మూవీ మేకర్స్ మరియు 14 రీల్స్ ప్లస్ ఈ సినిమాని నిర్మిస్తున్నాయి. థమన్ స్ ఈ సినిమాకి సంగీతం అందిస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa