మేజర్ సినిమాతో తొలిసారి పాన్ ఇండియా బరిలోకి దిగబోతున్నాడు యంగ్ హీరో అడవిశేష్. శశి కిరణ్ తిక్కా డైరెక్షన్లో, 2008 ముంబై దాడుల్లో ప్రాణాలు కోల్పోయిన మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ జీవితం ఆధారంగా మేజర్ చిత్రం తెరకెక్కుతుంది. ఈ చిత్రాన్ని సోనీ పిక్చర్స్ ఇండియా, GMB ఎంటర్టైన్మెంట్స్,A +S మూవీస్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. తెలుగు,హిందీ భాషల్లో ఏక కాలంలో తెరకెక్కించిన ఈ చిత్రాన్ని కన్నడ, మలయాళ, తమిళ భాషలలో కూడా విడుదల చేయనున్నారు. శ్రీచరణ్ పాకాల సంగీతం అందించిన ఈ మూవీ జూన్ 3న విడుదల కానుంది. అయితే, అదే రోజున కమల్ హాసన్ నటించిన విక్రమ్, అక్షయ్ కుమార్ నటించిన హిస్టారికల్ మూవీ పృథ్విరాజ్ లు విడుదలవుతున్నాయి. మూడు పెద్ద సినిమాలు ఒకరోజు విడుదలవుతుండటంతో బాక్సాఫీస్ క్లాష్ తప్పనిసరి. మరి ఇదే విషయాన్ని అడవిశేష్ ను అడిగితే ఆయన ఇచ్చిన సమాధానం విని జర్నలిస్టులు సైతం ఆశ్చర్యపోయారు. మేజర్ తెలుగులో, విక్రమ్ తమిళ్ లో , పృథ్విరాజ్ హిందీలో జూన్ 3న విడుదలవుతున్న పెద్ద సినిమాలని శేష్ తెలిపారు. సముద్రంలో పెద్ద చేప ఏదంటే, మేము (మేజర్) గోల్డ్ ఫిష్ లాంటి వాళ్ళమని శేష్ ఇచ్చిన సమాధానానికి విలేఖరులు కరతాళధ్వనులతో తమ స్పందనను తెలియచేసారు. మరి ఆ రోజు అంటే జూన్ 3న గోల్డ్ ఫిష్ అయ్యేదెవరో చూడాలి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa