ఇటీవల టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు నుండి విడుదలైన కొత్త చిత్రం సర్కారువారిపాట. పరశురామ్ డైరెక్ట్ చేసిన ఈ చిత్రంలో మహేష్ మాస్ యాక్టింగ్ కు, డైలాగ్స్ కు, స్టైలిష్ డ్యాన్స్ మూవ్ మెంట్స్ కు జనాలు నీరాజనాలు పలుకుతున్నారు. మే 12న విడుదలైన ఈ చిత్రం సూపర్ హిట్ టాక్ తో రన్ అవుతూ ఇప్పటికి రూ. 100 కోట్ల షేర్ ను రాబట్టింది. ప్రస్తుతం SVP సక్సెస్ ను ఎంజాయ్ చేస్తున్న మహేష్ వేసవి సెలవుల అనంతరం షెడ్యూల్ ప్రకారం, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ తో సినిమా స్టార్ట్ చేస్తాడు. ఇందులో పూజా హెగ్డే హీరోయిన్ గా ఎంపికైన విషయం తెలిసిందే. ఇటీవలే పూజా కార్యక్రమంతో లాంఛనంగా ప్రారంభమైన ఈ చిత్రానికి తమన్ సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమాపై పూర్తి వివరాలను త్వరలోనే అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది. ఈలోపే ఒక ఇంటరెస్టింగ్ న్యూస్ చిత్రపరిశ్రమలో హల్చల్ చేస్తుంది. మహేష్-త్రివిక్రమ్ SSMB 28లో మరో హీరో కు స్థానం ఉందని టాక్ నడుస్తోంది. అతిధి పాత్రకు మించి ఉండే ఆ పాత్రకోసం డైరెక్టర్ త్రివిక్రమ్ నాచురల్ స్టార్ నాని ని సంప్రదిస్తున్నట్టు సమాచారం. మరి ఈ సంప్రదింపులు సఫలం అయ్యి మహేష్ తో నాని నటిస్తాడా? లేక త్రివిక్రమ్ మరో హీరో ని ఎంపిక చేసుకుంటారా? అనే విషయం ఆసక్తిగా మారింది. ఈ ఉత్కంఠకు తెరపడాలంటే అధికారిక ప్రకటన వచ్చేంతవరకు వేచి చూడాల్సిందే.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa