పరశురామ్ పెట్ల దర్శకత్వంలో టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన 'సర్కారు వారి పాట' సినిమా ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదలైంది. ఈ సినిమా మంచి వసూళ్లను రాబడుతోంది. ఈ సినిమాలో మహేష్ సరసన కీర్తిసురేష్ జంటగా నటిస్తుంది. సుబ్బరాజు, వెన్నెల కిషోర్ తదితరులు ఈ యాక్షన్ ఎంటర్టైనర్లో కీలక పాత్రలో కనిపించనున్నారు. తాజా రిపోర్ట్స్ ప్రకారం, ఆస్ట్రేలియాలో 'సర్కారు వారి పాట' సినిమా ఈరోజు A$400K మార్కును క్రాస్ చేయనున్నట్లు ట్రేడ్ పండిట్స్ అంచనా వేస్తున్నారు. ఈ చిత్రం ఆదివారం వరకు A$399,480 వసూలు చేసింది. సింగిల్ లాంగ్వేజ్లో అత్యధిక వసూళ్లు రాబట్టిన రెండో తెలుగు సినిమాగా ఈ సినిమా నిలిచింది. GMB ఎంటర్టైన్మెంట్, మైత్రీ మూవీ మేకర్స్ మరియు 14 రీల్స్ ప్లస్ ఈ సినిమాని నిర్మిస్తున్నాయి. థమన్ స్ ఈ సినిమాకి సంగీతం అందిస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa