ఈ సంవత్సరంతో సీనియర్ ఎన్టీఆర్ జన్మించి నూరేళ్లు పూర్తవుతున్న సందర్భంలో, ఒక సంవత్సరం పాటు ఎన్టీఆర్ జయంతి ఉత్సవాలు జరుగుతాయని ఇటీవలే నటసింహం బాలకృష్ణ ప్రకటించారు. 2022, మే 28 నుండి ప్రారంభమయ్యే ఈ ఎన్టీఆర్ శత జయంతి వేడుకలు మే 28, 2023 వరకు నిర్విరామంగా జరుగుతాయి. మునుపెన్నడూ కనీవినీ ఎరుగని విధంగా పలు దేశాలలో జరుగుతున్న ఈ వేడుకలకు నందమూరి కుటుంబం నుండి నెలకు ఒక్కొక్కరు చొప్పున హాజరవుతారు.
మే 28న ఎన్టీఆర్ జయంతిని పురస్కరించుకుని నందమూరి కుటుంబం అభిమానులకు ఒక సర్ప్రైజ్ ను ప్లాన్ చేసిందని తెలుస్తుంది. ఇప్పటికే నాలుగైదు ప్రొడక్షన్ కంపెనీలు ఉన్న నందమూరి కుటుంబం నుండి మరొక ప్రొడక్షన్ హౌస్ ప్రకటించబడింది. బసవతారకరామ అనే పేరుతో ఒక బ్యానర్ ను నందమూరి కుటుంబ సభ్యులు ఎనౌన్స్ చేసారు. ప్రొడక్షన్ నెంబర్ వన్ గా ఏ సినిమాను రూపొందించేది మే 28న తెలియచేస్తామని తెలిపింది. అయితే, ఆ సినిమా ఎవరు చేశారు? నందమూరి హీరోల్లో ఈ బ్యానర్ ను ఎనౌన్స్ చేసింది ఎవరు? అనే వివరాలు తెలియాలంటే మే 28 వరకు ఆగాల్సిందే.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa