పరశురామ్ పెట్ల దర్శకత్వంలో టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన 'సర్కారు వారి పాట' సినిమా ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదలైంది. ఈ సినిమా అన్ని చోట్ల సాలిడ్ కలెక్షన్స్ ని రాబడుతుంది. ఈ సినిమాలో మహేష్ సరసన కీర్తి సురేష్ జంటగా నటిస్తుంది. సుబ్బరాజు, వెన్నెల కిషోర్ తదితరులు ఈ యాక్షన్ ఎంటర్టైనర్లో కీలక పాత్రలో కనిపించనున్నారు. తాజాగా ఈ యాక్షన్ ఎంటర్టైనర్ విడుదలై 3వ వారంలోకి ప్రవేశించింది. ఈ సినిమాలో థమన్ ఎస్ కంపోజ్ చేసిన 'మురారి బావ' అనే మెలోడియస్ ట్రాక్ పెద్ద స్క్రీన్లపై చూడటానికి చాలా మంది అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. లేటెస్ట్ అప్డేట్ ప్రకారం, సూపర్ స్టార్ కృష్ణ పుట్టినరోజు సందర్భంగా మే 31, 2022న ఈ పాటను యాడ్ చేస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అయితే మేకర్స్ నుంచి ఈ విషయం గురించి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. GMB ఎంటర్టైన్మెంట్, మైత్రీ మూవీ మేకర్స్ మరియు 14 రీల్స్ ప్లస్ ఈ సినిమాని నిర్మిస్తున్నాయి. థమన్ స్ ఈ సినిమాకి సంగీతం అందిస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa