ట్రెండింగ్
Epaper    English    தமிழ்

సాయి పల్లవి డెడికేషన్ మాములుగా లేదుగా... ఆ సినిమా కోసం తిండి మానేసి మరీ!

cinema |  Suryaa Desk  | Published : Mon, May 30, 2022, 12:07 PM

సాయి పల్లవి... ఫిదా సినిమాలో భానుమతిగా ప్రేక్షకులకు పరిచయమైన సాయి పల్లవి ఆ తర్వాత వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు. టాలీవుడ్, కోలీవుడ్లలో టాలెంటెడ్ హీరోయిన్ గా దూసుకుపోతున్న పల్లవి అంటే యూత్ లో క్రేజ్ మాములుగా లేదు. ఆమె నాచురల్ నటనకు, ముఖ్యంగా మెరుపుతీగలా యమా స్పీడ్ గా చేసే డాన్స్ మూవ్మెంట్స్ కు కుర్రకారు ఫిదా అవుతున్నారు. లేడీ పవర్  స్టార్ గా స్టార్ స్టేటస్ అందుకున్న పల్లవి గతేడాదిలో రెండు సినిమాలతో పలకరించి, రెండు సూపర్ హిట్లనందుకుంది. నానితో చేసిన శ్యామ్ సింగ రాయ్, నాగచైతన్యతో చేసిన లవ్ స్టోరీ సినిమాలు బాక్సాఫీస్ వద్ద ఘనవిజయం సాధించాయి. 


భళ్లాల దేవుడు దగ్గుబాటి రానా తో కలిసి సాయి పల్లవి నటించిన చిత్రం విరాట పర్వం. వేణు ఉడుగుల డైరెక్షన్లో వాస్తవ కథ ఆధారంగా తెరకెక్కిన ఈ చిత్రంలోని ఒక ఇంటెన్స్ సీన్ కోసం సాయి పల్లవి ఒక రోజంతా అన్నం తినకుండా షూట్ చేసిందట. ఆ సీన్ ఇంటెన్సిటీ ని, అందులో తన పాత్ర ముఖ్యతను దృష్టిలో పెట్టుకున్న సాయి పల్లవి సీన్ పండించడం కోసం, నాచురల్ గా రావటం కోసం, ఒక రోజంతా ఆహారమే తీసుకోలేదట. ఈ విషయాన్ని స్వయంగా డైరెక్టర్ వేణు తాజాగా జరిగిన ఒక ఇంటర్వ్యూలో తెలిపారు. ఈ విషయం తెలుసుకున్న  అభిమానులు, ప్రేక్షకులు సాయి పల్లవి డెడికేషన్ కు హ్యాట్సాఫ్ చెప్తున్నారు.  కరోనా మరియు ఇతర కారణాల వల్ల ఆలస్యమవుతూ వచ్చిన ఈ చిత్రం ఎట్టకేలకు జూలై 1వ తేదీన థియేటర్లకు రానుంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa