టాలీవుడ్ ఎనర్జిటిక్ హీరో రామ్ పోతినేని పవర్ఫుల్ డైరెక్టర్ బోయపాటి శ్రీనుతో పాన్-ఇండియా సినిమాని ప్రకటించిన సంగతి అందరికి తెలిసందే. ఈ చిత్రం తెలుగు, హిందీ, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో విడుదల కానుంది. ఈ సినిమాకి మూవీ మేకర్స్ ఇంకా టైటిల్ ని లాక్ చేయలేదు. తాజాగా ఈరోజు ఈ పాన్-ఇండియన్ మూవీ టెంపరరీగా 'RAPO 20' పేరుతో హైదరాబాద్లో పూజా కార్యక్రమంతో అధికారికంగా ప్రారంభించబడింది. ఈ లాంచ్ ఈవెంట్కి టీమ్ మరియు పలువురు సెలబ్రిటీలు హాజరయ్యారు. బూరుగుపల్లి శివరామకృష్ణ కెమెరా స్విచాన్ చేయగా, స్రవంతి రవికిషోర్ తొలి క్లాప్ ఇచ్చారు. తొలి షాట్కి బోయపాటి శ్రీను దర్శకత్వం వహిస్తున్నారు. ది వారియర్ దర్శకుడు ఎన్ లింగుస్వామి మరియు దర్శకుడు వెంకట్ ప్రభు స్క్రిప్ట్ అప్పగించారు. ఫుల్ మాస్ ఎలిమెంట్స్తో రానున్న ఈ సినిమాని శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్ బ్యానర్పై శ్రీనివాస చిట్టూరి నిర్మిస్తున్నారు.