ప్రముఖ దర్శకుడు పూరీ జగన్నాథ్ తనయుడు ఆకాష్ పూరి ప్రస్తుతం "చోర్ బజార్" అనే సినిమాలో నటిస్తున్న సంగతి అందరికి తెలిసిన విషయమే. జీవన్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో ఆకాష్ సరాసన గెహ్నా సిప్పీ నటించింది. "ఈరోజు", "నిరీక్షణ", "లేడీస్ టైలర్" వంటి చిత్రాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్న ప్రముఖ నటి అర్చన ఈ సినిమాలో కీలక పాత్రలో కనిపించనున్నారు. తాజాగా మూవీ మేకర్స్ ఈ సినిమా ఆడియో ఆల్బమ్ నుండి కొత్త పాటను ఆవిష్కరించారు. 'నూనుగు మీసాలా' అనే పాటను సౌత్ సిజ్లింగ్ బ్యూటీ సమంత విడుదల చేసారు. విఎస్ రాజు నిర్మిస్తున్న ఈ రొమాంటిక్ యాక్షన్ ఎంటర్టైనర్కు సురేష్ బొబ్బిలి సంగీతం అందించారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ జరుగుతుంది.