టాలీవుడ్ హీరో ఆది సాయికుమార్ నటించిన సినిమాలు ఈ మధ్యకాలంలో బాక్స్ఆఫీస్ వద్ద పెద్దగా ప్రాభవం ఏమి చూపలేదు. తాజాగా, ఫణి కృష్ణ దర్శకత్వంలో ఆది సాయికుమార్ ఒక మంచి ఫ్యామిలీ ఎంటర్టైనర్ను ప్రకటించాడు. ఈ చిత్రం ప్రస్తుతం షూటింగ్ శరవేగంగా జరుపుకుంటుంది. ఈ చిత్రంలో దిగంగనా సూర్యవంశీ, మర్నా మీనన్లు కథానాయికలుగా నటిస్తున్నారు. 'క్రేజీ ఫెలో' అనే టైటిల్ ని మూవీ మేకర్స్ ఈ సినిమాకి లాక్ చేసారు. తాజాగా మూవీ మేకర్స్ ఈ సినిమా నుంచి ఫస్ట్ సింగిల్ని విడుదల చేశారు. 'రావే రావే' అనే టైటిల్ తో విడుదలైన ఈ పాటకు ధృవన్ చక్కని ట్యూన్ అందించారు. అలరాజు ఈ పాటకు లిరిక్స్ అందించగా, శ్రీరామ చంద్ర, సత్య యామిని ఈ పాటను అందంగా పాడారు. కే కే రాధా మోహన్ ఈ సినిమాని నిర్మిస్తున్నారు. సతీష్ ముత్యాల సినిమాటోగ్రఫీ అందిస్తున్న ఈ చిత్రానికి ధృవన్ సంగీత అందిస్తున్నారు.