మారుతీ డైరెక్షన్ లో టాలీవుడ్ స్టార్ హీరో గోపీచంద్ సినిమా చేస్తున్న సంగతి అందరికి తెలిసందే. ఈ సినిమాకి 'పక్కా కమర్షియల్' అనే టైటిల్ ని మేకర్స్ లాక్ చేసారు. ఈ యాక్షన్-కామెడీ ఎంటర్టైనర్ మూవీలో గోపీచంద్ సరసన బబ్లీ బ్యూటీ రాశి ఖన్నా జోడిగా నటిస్తుంది. ఈ సినిమాలో సత్యరాజ్, అనసూయ భరద్వాజ్, రావు రమేష్, సప్తగిరి కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రం జులై 1, 2022న ప్రేక్షకుల ముందుకు రానుంది. తాజాగా మూవీ మేకర్స్ ఈ సినిమా ట్రైలర్ విడుదల తేదీని ప్రకటించడానికి ఒక వీడియో గ్లింప్సె ని విడుదల చేశారు. ఈ సినిమా పూర్తి ట్రైలర్ జూన్ 12, 2022న విడుదల కానుంది అని మూవీ మేకర్స్ ప్రకటించారు. UV క్రియేషన్స్ అండ్ GA2 పిక్చర్స్ ఈ సినిమాని నిర్మించింది. ఈ చిత్రానికి జేక్స్ బిజోయ్ సంగీతం మరియు కర్మ్ చావ్లా సినిమాటోగ్రఫీ అందించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa