కోలీవుడ్ సెన్సేషనల్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ త్వరలోనే టాలీవుడ్ లో అడుగు పెట్టనున్నారని, అదికూడా మెగా హీరో రామ్ చరణ్ సినిమాతో అని మీడియాలో కొన్నాళ్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. కొన్నాళ్ల క్రితం చెర్రీని కలిసిన లోకేష్ ఒక బై లింగువల్ స్టోరీని నేరేట్ చేసారని, స్టోరీ డిస్కస్ చేసేందుకు డేట్లడిగారని టాక్. ఖైదీ, మాస్టర్, విక్రమ్ వంటి సూపర్ డూపర్ హిట్లందించిన లోకేష్ తో చెర్రీ సినిమా చెయ్యబోతున్నాడని చెర్రీ ఫ్యాన్స్ తెగ సంబరపడిపోయారు. ఇదిలా ఉండగా, ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న లోకేష్ ఈ వార్తలపై క్లారిటీ ఇచ్చారు. రామ్ చరణ్,తను మంచి స్నేహితులమని, ఇప్పటివరకు ఆయనను రెండుసార్లు కలిసాననని చెప్పారు. ఐతే, ఎప్పుడూ కూడా తమ మధ్య స్టోరీ డిస్కషన్ వంటివి జరగలేదని తెలిపారు. దీంతో చెర్రీ అభిమానుల అనందం కాస్తా ఆవిరైపోయింది.
ప్రస్తుతం శంకర్ తో 15వ సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్నారు రామ్ చరణ్. తదుపరి జెర్సీ ఫేమ్ గౌతమ్ తిన్ననూరి డైరెక్షన్లో మరో సినిమా చెయ్యనున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa