MS రాజశేఖర్ రెడ్డి దర్శకత్వంలో టాలీవుడ్ హీరో నితిన్ ఒక సినిమా చేస్తున్న సంగతి అందరికి తెలిసిందే. ఈ సినిమాకి 'మాచర్ల నియోజకవర్గం' అనే టైటిల్ ని మేకర్స్ ఖరారు చేసారు. ఈ సినిమాలో నితిన్ ఐఏఎస్ ఆఫీసర్ గా నటిస్తున్నాడు. నితిన్ సరసన ఈ సినిమాలో కృతి శెట్టి అండ్ కేథరిన్ త్రెసా హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ సినిమా ఆగష్టు 12, 2022న విడుదల కానుంది. లేటెస్ట్ అప్డేట్ ప్రకారం, ఈ సినిమా చివరి పాట మినహా షూటింగ్ పార్ట్ మొత్తం పూర్తయింది అని సమచారం. ఈ చివరి పాటను మూవీ మేకర్స్ త్వరలో చిత్రీకరించనున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా జరుగుతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. పొలిటికల్ ఎలిమెంట్స్తో పక్కా మాస్ అండ్ కమర్షియల్ ఎంటర్టైనర్గా రానున్న ఈ సినిమాని ఆదిత్య మూవీస్తో కలిసి శ్రేష్ట్ మూవీస్ నిర్మించింది. మహతి స్వర సాగర్ ఈ చిత్రానికి సంగీత అందిస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa