తమిళ స్టార్ హీరో తలపతి విజయ్, వంశీ పైడిపల్లి దర్శకత్వంలో సినిమా చేయనున్న సంగతి అందరికి తెలిసిందే. ఈ సినిమాలో విజయ్ సరసన కన్నడ బ్యూటీ రష్మిక జంటగా నటిస్తుంది. ప్రభు, ప్రకాష్ రాజ్, జయసుధ మరియు శరత్ కుమార్ ఈ చిత్రంలో కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా హైదరాబాద్లో రెండు షెడ్యూల్స్ పూర్తి చేసుకుంది. లేటెస్ట్ అప్డేట్ ప్రకారం, థమన్ ఈ సినిమాలోని మొదటి సింగిల్ను కంప్లీట్ చేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. సిద్ శ్రీరామ్ మరియు జోనితా గాంధీ ఈ సాంగ్ ని పడినట్లు సమాచారం. ఈ చిత్రానికి తమిళం మరియు తెలుగులోనూ 'వరిసు' అనే టైటిల్ ని మూవీ మేకర్స్ లాక్ చేసారు. ఈ సినిమాకి సెన్సషనల్ మ్యూజిక్ డైరెక్టర్ థమన్ ఎస్ సంగీతం అందిస్తున్నారు. దిల్ రాజు అండ్ శిరీష్ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్పై ఈ సినిమాని నిర్మించనున్నారు.