చందూ మొండేటి దర్శకత్వంలో టాలీవుడ్ యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో నిఖిల్ సిద్ధార్థ ఒక సినిమా చేస్తున్న సంగతి అందరికి తెలిసిందే. ఈ సినిమాకి 'కార్తికేయ 2' అనే టైటిల్ ని మూవీ మేకర్స్ లాక్ చేసారు. ఈ చిత్రంలో నిఖిల్ లేడీ లవ్గా గ్లామర్ బ్యూటీ అనుపమ పరమేశ్వరన్ నటించింది. ఈ చిత్రం తెలుగు మరియు హిందీలో జూలై 22, 2022న థియేటర్లలో విడుదల కానుంది. తాజాగా ఇప్పుడు మూవీ మేకర్స్ ఈ సినిమాలోని 'నన్ను నేను అడిగా' అనే తొలి పాటను జూలై 11వ తేదీ ఉదయం 11 గంటలకు విడుదల చేయనున్నట్లు వెల్లడించారు. అంతకంటేముందు రాజమండ్రి, ఏలూరు, భీవరంలోని కొన్ని కళాశాలల్లో ఈ పాటను మూవీ మేకర్స్ ప్రదర్శించనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ మరియు పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ఈ సినిమాని నిర్మిస్తుంది. ఈ సినిమాకి కాల భైరవ సంగీతం అందించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa