చాన్నాళ్ల తర్వాత ప్రభుదేవా నటిస్తున్న చిత్రం "మై డియర్ భూతం". అల్లావుద్దీన్ అద్భుతదీపం తరహా సినిమాగా రూపొందుతున్నఈ సినిమాలో ప్రభుదేవా జీనీ గా కనిపించనున్నాడు. ఈ సినిమా మొత్తం ఒక చిన్న పిల్లాడికి, జీనీకి మధ్య సాగే అద్భుతమైన ప్రయాణం.
కోలీవుడ్ డైరెక్టర్ రాఘవన్ ఈ సినిమాకు దర్శకుడు. శ్రీ లక్ష్మి జ్యోతి క్రియేషన్స్ పతాకంపై రమేష్ పి పిళ్ళై ఈ సినిమాను నిర్మించారు. ఇమ్మాన్ ఈ సినిమాకు సంగీతమందించారు. ప్రభుదేవా తో పాటు ఈ సినిమాలో సంయుక్త, ఇమ్మాన్ అన్నచి, సురేష్ మీనన్ తదితరులు నటించారు.
నిన్న విడుదలైన ఈ చిత్రం చిన్నపిల్లలను విశేషంగా ఆకట్టుకుంటుంది. పోతే, ఈ మూవీ డిజిటల్ రైట్స్ ను ప్రఖ్యాత జీ 5 ఓటిటి సొంతం చేసుకుంది. థియేటర్లలో వస్తున్న రెస్పాన్స్ అంతంత మాత్రంగానే ఉంది కాబట్టి వీలైనంత త్వరలోనే ఈ సినిమా జీ 5 ఓటిటిలో స్ట్రీమింగ్ కొచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa