ఆది పినిశెట్టి... వెటరన్ డైరెక్టర్ రవిరాజా పినిశెట్టి వారసుడిగా సినీ ఎంట్రీ ఇచ్చిన ఆది కేవలం హీరో రోల్స్ కే కాక, అవకాశం వస్తే విలన్ వేషాలలో నటిస్తూ తన ప్రతిభను చాటుకుంటున్నాడు. అంతేకాక కోలీవుడ్ లోను పలు సినిమాలలో హీరోగా నటిస్తూ, అక్కడ కూడా సత్తా చాటుతున్నాడు.
ఇటీవలే హీరో రామ్ "ది వారియర్" చిత్రంలో 'గురు'గా తన స్టైలిష్ విలనిజాన్ని చూపించి ప్రేక్షకుల చేత శెభాష్ అనిపించుకున్నాడు. ఈ సినిమాతో హీరోగా రామ్ కి ఎంత పేరొచ్చిందో, విలన్గా ఆదికి కూడా అంతే పేరొచ్చింది. ఇటీవల జరిగిన ఒక ఇంటర్వ్యూలో యాంకర్ ఇలా ప్రశ్నించింది.... పవన్ కళ్యాణ్, రామ్ చరణ్, అల్లు అర్జున్, రామ్, తారక్ వంటి టాప్ హీరోలతో మల్టీస్టారర్స్ చేస్తున్న ఏకైక హీరో ఆదినేనని, వారందరు ఆదికి క్లోజ్ ఫ్రెండ్స్ కావడమే అందుకు కారణమని అనగా, ఆది అడ్డుపడి మిగిలిన వారందరు తన ఫ్రెండ్సే కానీ, తారక్ మాత్రం కాదు అని చెప్పి అందరిని షాక్ కు గురి చేసారు.
పవన్ కళ్యాణ్ తో "అజ్ఞాతవాసి", రామ్ చరణ్ తో "రంగస్థలం", అల్లుఅర్జున్ తో "సరైనోడు", రామ్ తో "ది వారియర్" సినిమాలలో నటించాడు కాబట్టి ఆదికి వారితో మంచి రిలేషన్ ఉంది. కానీ ఆది ఇప్పటివరకు తారక్ తో నటించలేదు, అదికాక రెండు మూడు అకేషన్స్ లో మాత్రమే తారక్ ను కలవడం జరిగింది.. అలా చూసుకుంటే, తారక్ తన ఫ్రెండ్ అని అనడం కరెక్ట్ కాదని చెప్పారు. తారక్ నటన అంటే తనకు చాలా ఇష్టమని, ఆయన హార్డ్ వర్క్ పట్ల తనకు అమితమైన గౌరవం ఉందని చెప్పుకొచ్చారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa