డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాధ్ డైరెక్షన్లో రౌడీ హీరో విజయ్ దేవరకొండ హీరోగా నటించిన చిత్రం "లైగర్". ఇందులో బాలీవుడ్ యంగ్ బ్యూటీ అనన్యా పాండే హీరోయిన్ గా నటిస్తుంది. బాక్సింగ్ నేపథ్యంలో సాగే ఈ సినిమాను ప్రఖ్యాత బాలీవుడ్ నిర్మాత కరణ్ జోహార్ తో కలిసి పూరి జగన్నాధ్, ఛార్మి సంయుక్తంగా నిర్మించారు. బాక్సింగ్ దిగ్గజం మైక్ టైసన్ ఈ సినిమాతో భారతీయ సినీ రంగ ప్రవేశం చెయ్యడం విశేషం.
ప్రపంచవ్యాప్తంగా ఆగస్టు 25వ తేదీన పాన్ ఇండియా భాషల్లో విడుదల కాబోతుండడంతో మేకర్స్ గత కొన్ని రోజుల నుండి ప్రచార కార్యక్రమాలను చేపట్టారు. ఈ మేరకు లైగర్ ట్రైలర్ ను జూలై 21వ తేదీన విడుదల చెయ్యబోతున్నట్టు, ఆరోజు ఉదయం హైదరాబాద్ లో, సాయంత్రం ముంబైలో గ్రాండ్ ఈవెంట్ ను నిర్వహించబోతున్నట్టు ప్రకటించిన విషయం తెలిసిందే. లేటెస్ట్ అప్డేట్ ప్రకారం, ముంబైలో జరగబోయే లైగర్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ కు స్టార్ హీరో రణ్ వీర్ సింగ్ చీఫ్ గెస్ట్ గా హాజరవబోతున్నట్టు మేకర్స్ కొంచెంసేపటి క్రితమే అఫీషియల్ ఎనౌన్స్మెంట్ చేసారు.