అజయ్ జ్ఞానముత్తు దర్శకత్వంలో కోలీవుడ్ వర్సటైల్ యాక్టర్ చియాన్ విక్రమ్ తన తదుపరి యాక్షన్ థ్రిల్లర్ సినిమాని ప్రకటించిన సంగతి అందరికి తెలిసిందే. ఈ సినిమాకి 'కోబ్రా' అనే టైటిల్ ని మూవీ మేకర్స్ లాక్ చేసారు. ఈ సినిమాలో విక్రమ్కు జోడీగా శ్రీనిధి శెట్టి నటిస్తోంది. తాజా అప్డేట్ ప్రకారం, ఆగష్టు 11, 2022న ప్రేక్షకుల ముందుకు రావాల్సి ఉన్న ఈ సినిమా CG వర్క్లు పెండింగ్లో ఉన్నందున షెడ్యూల్ ప్రకారం ఈ చిత్రాన్ని విడుదల చేయటం లేదు అని వార్తలు వినిపిస్తున్నాయి. ఈ సినిమా ఆగస్ట్ 31, 2022న థియేటర్లలోకి రానుంది అని లేటెస్ట్ టాక్. అయితే, మూవీ టీమ్ ఈ విషయం గురించి ఇంకా స్పందించలేదు. ఈ సినిమాలో ఇర్ఫాన్ పఠాన్, రోషన్ మాథ్యూ, మియా జార్జ్, మృణాళిని రవి, కెఎస్ రవి కుమార్ తదితరులు కీలక పాత్రలలో నటిస్తున్నారు. ఎఆర్ రెహమాన్ ఈ సినిమాకి సంగీతం అందిస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa