మాస్ రాజా రవితేజ నటించిన కొత్త చిత్రం "రామారావు ఆన్ డ్యూటీ" ఇటీవలే విడుదలై, మొదటి షోతోనే ఫ్లాప్ టాక్ తెచ్చుకుంది. రెండో రోజుకే పలు చోట్ల షోలు క్యాన్సిల్ అయ్యాయి. విడుదలకు ముందు డైరెక్టర్ శరత్ మండవ ఈ మూవీపై ఫుల్ కాన్ఫిడెన్స్ తో ఉన్నాడు. నెగిటివ్ టాక్ స్ప్రెడ్ చెయ్యొద్దని పలు మీడియా చానెళ్లను ఇండైరెక్ట్ గా టార్గెట్ చేసి మాట్లాడారు. విడుదల తరవాత సీన్ రివర్స్ అయ్యింది. ఇప్పుడు సోషల్ మీడియాలో శరత్ మీద విపరీతమైన ట్రోలింగ్స్ జరుగుతున్నాయి. ఆఖరికి ఈ సినిమా రవితేజ అభిమానులకు కూడా నచ్చలేదంటే, శరత్ మండవ ఎలాంటి సినిమా తీసాడో అర్ధం చేసుకోవాలి. కొంతమంది అభిమానులైతే, రవితేజకు ఓపెన్ లెటర్స్ రాసి, ఆయన సినిమా పట్ల తమ అయిష్టతను తెలుపుతున్నారు. ఇక , శరత్ మండవ ఐతే, తన మీదొస్తున్న ట్రోలింగ్స్ ను భరించలేక, ట్విట్టర్ ఖాతాను పబ్లిక్ నుండి ప్రైవేట్ మోడ్ లోకి మార్చుకుని, మీడియాకు దూరమయ్యారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa