కోలీవుడ్ సినిమాలలో అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్న సినిమాలలో మణిరత్నం 'పొన్నియిన్ సెల్వన్' ప్రాజెక్ట్ ఒకటి. ఈ సినిమా ప్రస్తుతం నిర్మాణ దశలో ఉండగా రెండు భాగాలుగా రూపొందుతోంది అని సమాచారం. పొన్నియిన్ సెల్వన్: పార్ట్ 1 సెప్టెంబర్ 30, 2022న ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధంగా ఉంది. ఈ భారీ బడ్జెట్ పీరియడ్ మూవీలో కార్తీ, విక్రమ్, జయం రవి ముఖ్యమైన పాత్రల్లో కనిపించనున్నారు. లేటెస్ట్ అప్డేట్ ప్రకారం, సెప్టెంబర్ 6న చెన్నైలో జరగనున్న స్పెషల్ ఈవెంట్లో ఈ సినిమా ట్రైలర్ను భారీ స్థాయిలో లాంచ్ చేయనున్నట్లు ఫిలిం సర్కిల్ లో వార్తలు వినిపిస్తున్నాయి. ఈ ఈవెంట్ లో ఈ సినిమా పూర్తి ఆడియోను కూడా లాంచ్ చేయనున్నట్టు సమాచారం. కొన్ని రోజుల క్రితమే ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసుకుని పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉంది. ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తుండగా, శ్రీకర్ ప్రసాద్ ఎడిటింగ్ని అందిస్తున్నారు. 250 కోట్ల భారీ బడ్జెట్తో రూపొందుతున్న ఈ సినిమాని మద్రాస్ టాకీస్తో కలిసి లైకా ప్రొడక్షన్స్ నిర్మిస్తుంది. ఈ ప్రాజెక్ట్ కి సంబందించిన మరిన్ని వివరాలు మేకర్స్ త్వరలో వెల్లడి చేయనున్నారు.
![]() |
![]() |