ట్రెండింగ్
Epaper    English    தமிழ்

నేటితో 100 రోజులు పూర్తి చేసుకున్న 'సర్కారు వారి పాట'

cinema |  Suryaa Desk  | Published : Fri, Aug 19, 2022, 02:04 PM

పరశురామ్ పెట్ల దర్శకత్వంలో టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన 'సర్కారు వారి పాట' సినిమా ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదలైంది. ఈ సినిమా అన్ని చోట్ల సాలిడ్ కలెక్షన్స్ ని రాబట్టింది. ఈ సినిమాలో మహేష్ సరసన కీర్తి సురేష్ జంటగా నటిస్తుంది. సుబ్బరాజు, వెన్నెల కిషోర్ తదితరులు ఈ యాక్షన్ ఎంటర్‌టైనర్‌లో కీలక పాత్రలో కనిపించనున్నారు. లేటెస్ట్ రిపోర్ట్స్ ప్రకారం, ఈ కమర్షియల్ సినిమా గోపాలపట్నం (వైజాగ్) మరియు చిలకలూరిపేట అనే 2 డైరెక్ట్ సెంటర్లలో 100 రోజులు పూర్తి చేసుకుంది. సర్కారు వారి పాట సినిమా 2022లో విడుదలై TFIలో అత్యధిక వసూళ్లు రాబట్టిన సినిమాగా నిలిచింది. GMB ఎంటర్‌టైన్‌మెంట్, మైత్రీ మూవీ మేకర్స్ మరియు 14 రీల్స్ ప్లస్‌ ఈ సినిమాని నిర్మిస్తున్నాయి. థమన్ స్ ఈ సినిమాకి సంగీతం అందిస్తున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa