ట్రెండింగ్
Epaper    English    தமிழ்

యమ స్మార్ట్ దొంగగా... కీరవాణి తనయుడు

cinema |  Suryaa Desk  | Published : Fri, Aug 19, 2022, 04:56 PM

టాలీవుడ్ టాప్ మ్యూజిక్ డైరెక్టర్ ఎం ఎం కీరవాణి తనయుడు శ్రీ సింహ హీరోగా, సతీష్ త్రిపుర డైరెక్షన్లో తెరకెక్కుతున్న చిత్రం "దొంగలున్నారు జాగ్రత్త". ప్రీతి అస్రాని ఇందులో హీరోయిన్ గా నటిస్తుంది.
లేటెస్ట్ గా ఈ మూవీ నుండి శ్రీ సింహ ను ప్రేక్షకులకు పరిచయం చేస్తూ చిన్న గ్లిమ్స్ వీడియోను విడుదల చేసారు. ఇందులో శ్రీ సింహ యమ స్మార్ట్ దొంగగా కనిపిస్తున్నాడు. ఇందుకు 2007 లో వచ్చిన జూనియర్ ఎన్టీఆర్ సూపర్ హిట్ చిత్రం "యమదొంగ" చైల్డ్ స్టోరీని ఇన్స్పిరేషన్ గా తీసుకున్నారు.
సురేష్ ప్రొడక్షన్స్, గురు ఫిలిమ్స్, మంజర్ స్టూడియోస్ సంయుక్త బ్యానర్లపై సురేష్ బాబు దగ్గుబాటి, సునీత తాటి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. సెప్టెంబర్ 23వ తేదీన థియేటర్లలో విడుదల కాబోతున్న ఈ చిత్రంలో సముద్రఖని కీలక పాత్రను పోషిస్తున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa