ట్రెండింగ్
Epaper    English    தமிழ்

పూరిజగన్నాథ్ మహేష్‌తో ఆ రెండు సినిమాలు చేయాలిఅనుకున్నారు అంట .

cinema |  Suryaa Desk  | Published : Wed, Aug 24, 2022, 03:43 PM

పూరిజగన్నాథ్ డైరక్టర్ ,  విజయ్ దేవరకొండ హీరోగా నటిస్తున్న ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ అనన్య పాండే హీరోయిన్ గా నటిస్తుంది. ఈ సినిమా ఆగస్టు 25న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది. పాన్ ఇండియా మూవీగా తెరకెక్కిన ఈ సినిమాలో విజయ్ ను బాక్సర్ గా చూపించనున్నారు పూరి. ఇక ఈ సినిమా ప్రమోషన్స్ ఫుల్ స్వింగ్ లోజరుగుతున్నాయి. ఇప్పటికే దేశంలో పలు నగరాలను చుట్టేసిన లైగర్ టీమ్. వరుస ఇంటర్వ్యూలతో బిజె బిజీగా గడిపేస్తున్నారు.తాజాగా ఓ ఇంటర్వ్యూలో దర్శకుడు పూరిజగన్నాథ్ మాట్లాడుతూ.. ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. అలాగే మీరు తీసిన  సినిమాల్లో ఏ  సినిమాలకు సీక్వెల్స్ చేయాలనీ అనుకుంటున్నారు అని ప్రశ్న ఎదురైనప్పుడు పూర్తి  ఆసక్తికర సమాధానం చెప్పాడు. తాను తెరకేకించిన సినిమాల్లో మహేష్ బాబు నటించిన పోకిరి, బిజినెస్ మేన్ సినిమాలంటే తనకు చాలా ఇష్టమని ఆ రెండు సినిమాకు సీక్వెల్స్ చేయాలని ఉందని అన్నారు  మహేష్ నటించిన ఈ రెండు సినిమాలో మంచి విజయాలను అందుకున్నాయి. ముఖ్యంగా పోకిరి సినిమా ఇండస్ట్రీ హిట్ గా నిలిచిన విషయం తెలిసిందే. ఇక బిజినెస్ మేన్ కూడా సూపర్ హిట్ గా నిలిచింది. మహేష్ బిజీగా ఉండటంతో ఈ సినిమా సీక్వెల్స్ చేయడం కుదరలేదు. మహేశ్ అభిమానులంతా  మరోసారి పండుగాడి రోల్ ను చూడాలనుకుంటున్నారు. అలాగే ‘బిజినెస్ మేన్’ సినిమాలో సూర్య భాయ్ పాత్రకు సీక్వెల్ నుచేయొచ్చు. మంచి స్కోప్ ఉన్న పవర్ఫుల్ రోల్ అది. ఆ రెండు సినిమాలను త్వరలో వర్కౌట్ చేయడానికే ట్రై చేస్తాను అని పూరి చెప్పుకొచ్చారు .






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa