తెలుగు సినీ పరిశ్రమలో ఎక్కువగా సంక్రాంతి, సమ్మర్ కోసం ఎదురుచూస్తారు తర్వాత అందరి చూపు ఉండేది దసరా సీజన్పైనే. 10 రోజులకి పైగా హాలీడేస్ ఉంటాయి కాబట్టి చాలా మంది హీరోలు ఆ సీజన్లో తమ మూవీస్తో రిలీజ్ చేయటానికి ఇష్టపడతారు ఈ సారి కూడా అదే జరుగుతోంది.అక్టోబర్లో రాబోయే దసరా సీజన్ కోసం ఇద్దరు స్టార్ హీరోలు ఒకేరోజు బాక్సాఫీస్ బరిలో దిగనున్నారు. అందులో చిరంజీవి అలాగే నాగార్జున కానీ మరో హీరో కూడా రేసులో నిలవబోతున్నారు.
గాడ్ ఫాదర్ చిరంజీవి సినిమా అక్టోబర్ 5న విడుదల కానున్నట్లు అధికారికంగా ప్రకటించారు మెగాస్టార్. మోహన్ రాజా తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో సల్మాన్ ఖాన్, నయనతార కీలక పాత్రల్లో నటిస్తున్నారు. . ఆ సినిమా అక్టోబర్ 2న అంటే దసరా రోజున విడుదల కానుంది. చిరంజీవితో పాటు అక్కినేని నాగార్జున కూడా దసరాకే వస్తున్నారు. ఈయన నటిస్తున్నసినిమా ది గోస్ట్ అక్టోబర్ 5న రానుంది. ప్రవీణ్ సత్తారు తెరకెక్కిస్తున్న ఈ యాక్షన్ ఎంటర్టైనర్లో నాగార్జున స్పైగా నటిస్తున్నారు. .. ఈ ఇద్దరు ఇండస్ట్రీ ఫ్రెండ్స్ మధ్య సమరం బాక్సాఫీస్ దగ్గర ఆసక్తికరంగా మారడం ఖాయంగా కనిపిస్తోంది. ఇప్పటి వరకు ఒక్కసారి కూడా చిరు, నాగార్జున సినిమాలు ఒకేరోజు విడుదల కాలేదు. వారం వ్యవధిలో విడుదలయ్యాయి. కానీ ఈసారి మాత్రం రెండు రోజుల వ్యవధి లో వీరిద్దరు బాక్సాఫీస్ దగ్గర పోటీకి సై అంటున్నారు.
చిరంజీవి, నాగార్జునతో పాటు ఈ సారి దసరాకు మంచు విష్ణు కూడా వస్తున్నారు. ఈయన నటిస్తున్న జిన్నా సినిమా సైతం అదే రోజు విడుదల కానున్నట్లు ఇదివరకే ప్రకటించారు మేకర్స్. కోన వెంకట్ డైరక్టర్ . ఇప్పటికే ఈ చిత్ర షూటింగ్ పూర్తయంది . మొత్తానికి దసరా పండక్కి చిరు, నాగార్జున, విష్ణు మధ్య త్రిముఖ పోరు జరగబోతుందన్నమాట.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa