వివేక్ రంజన్ అగ్నిహోత్రి దర్శకత్వం వహించిన "ది కాశ్మీర్ ఫైల్స్" మార్చి 11న థియేటర్లో రిలీజ్ అయ్యి బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డులు సృష్టించింది. కశ్మీర్ లో సాగే ఈ సినిమా భారత్, పాకిస్థాన్ల మధ్య ఇరుక్కున్న కాశ్మీరీల అంశాలతో ఈ సినిమా వచ్చింది. చిన్న బడ్జెట్తో తెరకెక్కిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద 250 కోట్లలకి పైగా వసూలు చేసి రికార్డులను సృష్టించింది. లేటెస్ట్ అప్డేట్ ప్రకారం, ఈ సినిమా తెలుగు వెర్షన్ వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ ఆగస్టు 28న మధ్యాహ్నం 12 గంటలకు జీ తెలుగు ఛానెల్లో ప్రదర్శించబడుతుందని సమాచారం. 1990వ దశకంలో కాశ్మీరీ పండిట్ కమ్యూనిటీ వలస సమయంలో పడిన పోరాటం ఆధారంగా ఈ చిత్రం రూపొందించబడింది. అనుపమ్ ఖేర్, మిథున్ చక్రవర్తి, దర్శన్ కుమార్ అండ్ పల్లవి జోషి ముఖ్యమైన పాత్రలు పోషించారు. అభిషేక్ అగర్వాల్ ఈ సినిమాని నిర్మించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa