అజయ్ జ్ఞానముత్తు దర్శకత్వంలో కోలీవుడ్ వర్సటైల్ యాక్టర్ చియాన్ విక్రమ్ తన తదుపరి యాక్షన్ థ్రిల్లర్ సినిమాని ప్రకటించిన సంగతి అందరికి తెలిసిందే. ఈ సినిమాకి 'కోబ్రా' అనే టైటిల్ ని మూవీ మేకర్స్ లాక్ చేసారు. ఈ సినిమాలో విక్రమ్కు జోడీగా శ్రీనిధి శెట్టి నటిస్తోంది. ఈ సినిమా ఆగస్ట్ 31, 2022న థియేటర్లలోకి రానుంది. తాజాగా మూవీ మేకర్స్ ఈ సినిమా తెలుగు వెర్షన్ టీజర్ ని విడుదల చేసారు. 24 గంటల్లో ఈ టీజర్ 175K లైక్స్తో పాటు 3.5 మిలియన్ల వ్యూస్ను సాధించింది. ప్రస్తుతం ప్రమోషన్లో బిజీగా ఉన్న మూవీ టీమ్, ఆగస్ట్ 28న హైదరాబాద్కు రానుంది. ఈ సినిమాలో ఇర్ఫాన్ పఠాన్, రోషన్ మాథ్యూ, మియా జార్జ్, మృణాళిని రవి, కెఎస్ రవి కుమార్ తదితరులు కీలక పాత్రలలో నటిస్తున్నారు. ఎఆర్ రెహమాన్ ఈ సినిమాకి సంగీతం అందిస్తున్నారు. సెవెన్ స్క్రీన్ స్టూడియోస్ ఈ సినిమాని నిర్మించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa