ట్రెండింగ్
Epaper    English    தமிழ்

అనసూయ ఇన్ డైరెక్ట్ ట్వీట్ ...ఎవరికోసం?

cinema |  Suryaa Desk  | Published : Thu, Aug 25, 2022, 06:41 PM

ప్రముఖ బుల్లితెర వ్యాఖ్యాత అనసూయ భరద్వాజ్ సోషల్ మీడియాలో చాలా చురుగ్గా ఉంటుంది. లేటెస్ట్ గా ఈ రోజు మధ్యాహ్నం అనసూయ చేసిన ఒక ట్వీట్ ఎవరి గురించి చేసింది అన్నది తెలియక నెటిజన్లు అయోమయంలో పడిపోయారు. ఐతే, కొంతమందికి మాత్రం అనసూయ ఈ ట్వీట్ ఎవరిని ఉద్దేశించి చేసిందో క్లియర్ గా అర్థమైందని తెలుస్తుంది.
ఇంతకు అనసూయ యేమని ట్వీట్ చేసిందంటే "అమ్మని అన్న ఉసురు ఊరికే పోదు... కర్మ కొన్నిసార్లు రావటం లేటవ్వచ్చేమో కానీ రావటం మాత్రం పక్కా" అని రాసుకొచ్చింది. లైగర్ విడుదల రోజే అనసూయ ఈ ట్వీట్ చెయ్యడం చర్చకు దారితీసింది.
విజయ్ దేవరకొండ నటించిన "అర్జున్ రెడ్డి" సినిమాలో అమ్మ మీద యేవో పిచ్చి డైలాగులు ఉంటాయి. వాటిని ప్రమోషన్స్ టైం లో విజయ్ పబ్లిక్ గా కూడా వాడాడు. అందుకు అనసూయ బాహాటంగానే స్పందించింది. అందుకు విజయ్ ఫ్యాన్స్ కూడా ఆమెపై ట్విట్టర్ లో చిన్నపాటి యుద్ధమే చేసారు. ఐతే ఇది గతం.
లేటెస్ట్ గా అనసూయ చేసిన ట్వీట్ విజయ్ దేవరకొండను ఉద్దేశించి చేసిందని, మరోసారి విజయ్ ఫ్యాన్స్ ఆమెను సోషల్ మీడియాలో ఆడేసుకుంటున్నారు. 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa