ప్రస్తుతం నటసింహం బాలకృష్ణ కెరీర్ లో 107వ సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమాకు గోపీచంద్ మలినేని డైరెక్టర్. మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తుంది.
కొన్ని రోజుల నుండి టాలీవుడ్లో నిర్మాతల సమ్మె నడుస్తుండడంతో ఈ మూవీ షూటింగ్ కూడా ఆగిపోయింది. లేటెస్ట్ గా ఈ మూవీ షూటింగ్ టర్కీ లో ప్రారంభం కాబోతుందని తెలుస్తుంది. విడుదల తేదీలు దగ్గరలో ఉన్న సినిమాలు ఆగస్టు 25 నుండి షూటింగులు మొదలు పెట్టుకోవచ్చని నిర్మాతల సంఘం తెలపడంతో రేపటి నుండి NBK 107 మూవీ షూటింగ్ టర్కీ లో స్టార్ట్ కాబోతుంది. ఈ మేరకు ఇప్పటికే బాలయ్య అండ్ టీం టర్కీ లో ల్యాండ్ అయ్యారట.
వరలక్ష్మి శరత్ కుమార్, దునియా విజయ్ కీలకపాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి తమన్ సంగీతం అందిస్తున్నారు. ఈ ఏడాది డిసెంబర్ లో ఈ సినిమా విడుదల కాబోతుందని టాక్.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa