ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఆగస్టు 31 నుండి ఆహాలో "పంచతంత్ర కథలు" స్ట్రీమింగ్

cinema |  Suryaa Desk  | Published : Sun, Aug 28, 2022, 12:00 AM

చిన్న చిన్న కథల సమాహారంగా ఈ మధ్యన కొన్ని సినిమాలు వస్తున్నాయి. అలాంటి కోవలోకే వస్తుంది "పంచతంత్ర కథలు" సినిమా. గంగనమోని శేఖర్ రచన - దర్శకత్వం వహించిన ఈ సినిమా ఈమధ్యనే థియేటర్లలో విడుదలై మంచి రివ్యూలు పొందింది. కానీ కలెక్షన్లయితే సరిగా రాలేదు. 
దీంతో మేకర్స్ ఈ మూవీని వీలైనంత త్వరగా డిజిటల్ స్ట్రీమింగ్ కు తీసుకురావాలని ప్లాన్ చేసినట్టున్నారు. మరో నాల్రోజుల్లో అంటే ఆగస్టు 31 నుండి తెలుగు ఓటిటి ఆహాలో ఈ మూవీ స్ట్రీమింగ్ కాబోతుంది.
మధు క్రియేషన్స్ బ్యానర్ పై మధు నిర్మించిన ఈ చిత్రంలో నోయెల్, నందిని రాయ్, సాయి రోనక్ తదితర తారాగణం నటించారు.  






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa