అజయ్ జ్ఞానముత్తు దర్శకత్వంలో కోలీవుడ్ వర్సటైల్ యాక్టర్ చియాన్ విక్రమ్ తన తదుపరి యాక్షన్ థ్రిల్లర్ సినిమాని ప్రకటించిన సంగతి అందరికి తెలిసిందే. ఈ సినిమాకి 'కోబ్రా' అనే టైటిల్ ని మూవీ మేకర్స్ లాక్ చేసారు. ఈ సినిమాలో విక్రమ్కు జోడీగా శ్రీనిధి శెట్టి నటిస్తోంది. ఈ సినిమా ఆగస్ట్ 31, 2022న థియేటర్లలోకి రానుంది. ఈ చిత్రం సెన్సార్ ఫార్మాలిటీస్ పూర్తి చేసుకొని U/A సర్టిఫికేట్ పొందినట్లు సమచారం. లేటెస్ట్ అప్డేట్ ప్రకారం, ఈ సినిమా 3 గంటల 3 నిమిషాలు రన్ టైమ్ ని కలిగి ఉంది అని మూవీ మేకర్స్ వెల్లడించారు. ఈ సినిమాలో ఇర్ఫాన్ పఠాన్, రోషన్ మాథ్యూ, మియా జార్జ్, మృణాళిని రవి, కెఎస్ రవి కుమార్ తదితరులు కీలక పాత్రలలో నటిస్తున్నారు. ఎఆర్ రెహమాన్ ఈ సినిమాకి సంగీతం అందిస్తున్నారు. సెవెన్ స్క్రీన్ స్టూడియోస్ ఈ సినిమాని నిర్మించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa