వీరం, వేదాళం, వివేగం, విశ్వాసం వంటి సూపర్ హిట్ సినిమాల దర్శకుడు సిరుతై శివ, కోలీవుడ్ స్టార్ హీరో సూర్య కాంబినేషన్లో ఒక సినిమా రూపొందుతున్న విషయం తెలిసిందే. ఈ మూవీ సూర్య కెరీర్ లో 42వది కావడంతో సూర్య 42 గా పిలుస్తున్నారు.
ఈ సినిమా నుండి కొంచెంసేపటి క్రితమే మేకర్స్ బిగ్ అప్డేట్ ఇచ్చారు. అదేంటంటే, రేపు ఉదయం పదింటికి ఈ మూవీ మోషన్ పోస్టర్ రిలీజ్ కాబోతుంది.
దేవిశ్రీప్రసాద్ సంగీతం అందిస్తున్న ఈ మూవీని స్టూడియో గ్రీన్, యూవీ క్రియేషన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. బాలీవుడ్ హాట్ బ్యూటీ దిశా పటాని ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తుండగా, యోగిబాబు, కోవై సరళ, ఆనంద్ రాజ్ తదితరులు కీలకపాత్రల్లో నటిస్తున్నారు. ప్రస్తుతం ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ జరుపుకుంటుంది.