ట్రెండింగ్
Epaper    English    தமிழ்

స్టార్ హీరోయిన్ కి పోలీసుల సమన్లు

cinema |  Suryaa Desk  | Published : Mon, Sep 12, 2022, 04:30 PM
బాలీవుడ్ హీరోయిన్ జాక్వెలిన్ ఫెర్నాండేజ్ కి ఢిల్లీ పోలీసులు తాజాగా సమన్లు ​​జారీ చేశారు. మనీలాండరింగ్ కేసు విచారణలో భాగంగా సెప్టెంబర్ 14న విచారణకు హాజరు కావాలని సోమవారం సమన్లు ​​జారీ చేశారు. ముందస్తుగా ఒప్పుకున్న కొన్ని పనులు ఉండటం వల్ల జాక్వెలిన్ మరో తేదీని ఇవ్వాలని కోరింది. దీంతో ఢిల్లీ పోలీసులు సోమవారం జరగాల్సిన విచారణను వాయిదా వేశారు. సెప్టెంబర్ 14న విచారణలో పాల్గొనాల్సిందిగా కోరారు.





SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa