ట్రెండింగ్
Epaper    English    தமிழ்

అందుకే ఆ సినిమా వదిలేశా

cinema |  Suryaa Desk  | Published : Sat, Nov 10, 2018, 04:55 PM

చక్కని అభినయంతో తెలుగు ప్రేక్షకుల అభిమానం పొందిన నటి నిత్యా మీనన్. ‘మిషన్ మంగల్’ సినిమాతో ఆమె త్వరలో బాలీవుడ్‌లోనూ అడుగు పెట్టనున్నారు. ఈ సందర్భంగా ఆమె ఓ వార్త సంస్థతో మాట్లాడారు. సోషల్ మీడియాలో జోరుగా సాగుతున్న #MeToo ఉద్యమం, ఇండస్ట్రీలో లైంగిక వేధింపులు గురించి నిత్య తనదైన శైలిలో స్పందించారు. 


ఇటీవల కేరళాలో ఓ ప్రముఖ నటిని కిడ్నాప్ చేసి.. లైంగిక దాడికి పాల్పడిన ఘటన ఇండస్ట్రీలో సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. ఈ ఘటన వెనుక హీరో దిలీప్ ఉన్నాడనే ఆరోపణలు కూడా వచ్చాయి. ఈ సందర్భంగా నటీమణులంతా ‘ఉమెన్ ఇన్ సినిమా కలెక్టివ్’గా ఏర్పడి ఉద్యమించారు. అయితే, అదే పరిశ్రమకు చెందిన నిత్యా మీనన్ మాత్రం అందులో చేరలేదు. దీనిపై ఆమె స్పందిస్తూ.. ‘‘లైంగిక వేధింపులపై నేను పోరాడే విధానం వేరు. మద్దతు తెలపలేదని నేను వారి ఉద్యమానికి వ్యతిరేకమని భావించవద్దు. వారు ఎదుర్కొంటున్న సమస్యలు గురించి నాకు తెలుసు. అలాంటి సమస్య నాకు ఎదురైతే.. ఏం చేయాలో తెలుసు. నేను చేసే పనులు చాలా సైలెంట్‌గా ఉంటాయి’’ అని తెలిపారు. 


ఔను ఆ సినిమా వదిలేశా: లైంగిక వేధింపుల నేపథ్యంలో మీరు ఓ చిత్రాన్ని వదులుకున్నారని తెలిసింది నిజమేనా అని అడిగిన ప్రశ్నకు నిత్యా సమాధానం ఇస్తూ.. ‘ఔను, నిజమే’ అని సమాధానం ఇచ్చారు. అయితే, ఆ సినిమా పేరును మాత్రం ఆమె వెల్లడించలేదు. అయితే, అలాంటి సందర్భాలు ఎదురైనప్పుడు తాను సినిమాలు వదలుకోడానికి సంకోచించనని నిత్యా తెలిపారు. సినిమా అంగీకరించడానికి ముందుగానే అలాంటి విషయాల్లో జాగ్రత్తపడతానని పేర్కొన్నారు. ‘‘ఇందుకు నేను కొన్ని పద్ధతులను పాటిస్తాను. లైంగిక వేధింపులు వంటి పరిస్థితి ఏర్పడకుండా ఉండాలంటే మన వర్కింగ్ స్టైల్‌తోనే బలమైన మెసేజ్ ఇవ్వాలి. దీనివల్ల మనతో తప్పుగా ప్రవర్తించడం, లేదా తప్పుడు ఉద్దేశంతో అవకాశాలు ఇస్తామనడం వంటివి ఉండవు’’ అని నిత్యా తెలిపారు. ప్రస్తుతం ఆమె బాలకృష్ణ నటిస్తున్న ‘యన్.టి.ఆర్ - కథానాయకుడు’ సినిమాలో నటిస్తున్నారు. 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa