ట్రెండింగ్
Epaper    English    தமிழ்

వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ తేదీని లాక్ చేసిన 'సర్కారు వారి పాట'

cinema |  Suryaa Desk  | Published : Mon, Sep 19, 2022, 09:13 PM

పరశురామ్ పెట్ల దర్శకత్వంలో టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన 'సర్కారు వారి పాట' సినిమా ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదలైంది. ఈ సినిమా అన్ని చోట్ల సాలిడ్ కలెక్షన్స్ ని రాబట్టింది. ఈ సినిమాలో మహేష్ సరసన కీర్తి సురేష్ జంటగా నటిస్తుంది. లేటెస్ట్ రిపోర్ట్స్ ప్రకారం, ఈ కమర్షియల్ సినిమా వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ సెప్టెంబర్ 25, 2022న సాయంత్రం 6 గంటలకు స్టార్ మా ఛానెల్‌లో ప్రదర్శించబడుతుందని సమాచారం.


సుబ్బరాజు, వెన్నెల కిషోర్ తదితరులు ఈ యాక్షన్ ఎంటర్‌టైనర్‌లో కీలక పాత్రలో కనిపించనున్నారు. సర్కారు వారి పాట సినిమా 2022లో విడుదలై TFIలో అత్యధిక వసూళ్లు రాబట్టిన సినిమాగా నిలిచింది. GMB ఎంటర్‌టైన్‌మెంట్, మైత్రీ మూవీ మేకర్స్ మరియు 14 రీల్స్ ప్లస్‌ ఈ సినిమాని నిర్మిస్తున్నాయి. థమన్ స్ ఈ సినిమాకి సంగీతం అందిస్తున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa