గోపీచంద్ మలినేని దర్శకత్వంలో నటసింహ బాలకృష్ణ 'NBK107' సినిమా చేస్తున్న సంగతి అందరికి తెలిసిందే. ఈ యాక్షన్ డ్రామా సినిమాలో బాలయ్య సరసన శృతి హాసన్ జోడిగా నటిస్తోంది. ఈ సినిమాకి 'జై బాలయ్య' అనే టైటిల్ని లాక్ చేయటానికి మూవీ మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. గతంలో విడుదలైన ఈ సినిమా ఫస్ట్లుక్, టీజర్కి అభిమానుల నుంచి మంచి స్పందన వచ్చింది. ఈ సినిమా ప్రేక్షకుల్లో మంచి బజ్ క్రియేట్ చేసింది.
లేటెస్ట్ అప్డేట్ ప్రకారం, ఈ సినిమా నాన్ థియేట్రికల్ రైట్స్ 58 కోట్లకు అమ్ముడుపోయినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ సినిమాలో వరలక్ష్మి శరత్కుమార్ కీలక పాత్ర పోషిస్తోంది. దునియా విజయ్ విలన్ పాత్రలో కనిపించనున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ టర్కీలో జరుగుతోంది. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించిన ఈ చిత్రానికి థమన్ ఎస్ సంగీతం అందించారు.