గుణశేఖర్ దర్శకత్వంలో సౌత్ ఇండియా స్టార్ బ్యూటీ సమంత 'శకుంతలం' సినిమా చేస్తున్న సంగతి అందరికి తెలిసిందే. ఈ పిరియాడిక్ మైథలాజికల్ లవ్ డ్రామా షూటింగ్ ని కంప్లీట్ చేసినట్లు సమాచారం. తాజాగా ఇప్పుడు ఈ సినిమా విడుదల తేదీని లాక్ చేసింది. ఈ పాన్-ఇండియన్ పీరియాడికల్ డ్రామా ప్రపంచవ్యాప్తంగా నవంబర్ 4, 2022న ప్రేక్షకుల ముందుకు రానుంది. అదే విషయాన్ని ప్రకటించడానికి మూవీ మేకర్స్ వీడియో గ్లింప్సె ని విడుదల చేశారు.
ఈ చిత్రంలో దేవ్ మోహన్ దుష్యంత పాత్రలో నటిస్తుండగా, అల్లు అర్జున్ కూతురు అర్హ ఈ చిత్రంలో ప్రిన్స్ భరతుడిగా కనిపించనుంది. మోహన్ బాబు దుర్వాస పాత్రలలో నటించారు. ఈ చిత్రంలో అదితి బాలన్, ప్రకాష్ రాజ్, అనన్య నాగళ్ల, గౌతమి, కబీర్ బేడీ, మధుబాల, కబీర్ దుహన్ సింగ్ ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. మణిశర్మ ఈ సినిమాకి సంగీతం అందించాడు.