ట్రెండింగ్
Epaper    English    தமிழ்

కృష్ణ, మహేష్ బాబులకు మంత్రి తలసాని పరామర్శ

cinema |  Suryaa Desk  | Published : Thu, Sep 29, 2022, 06:58 PM

సూపర్ స్టార్ కృష్ణ గారి మొదటి భార్య శ్రీమతి ఇందిరాదేవి గారు నిన్న తెల్లవారుఝామున మరణించిన విషయం తెలిసిందే. అమ్మంటే దేవుడితో సమానమైన మహేష్ బాబుకు ఈ వార్త తెలియడంతో నిలబడిన చోటే కూలబడినంత పనైంది. ఆ బాధతోనే ఇందిరాదేవిగారి అంతిమ సంస్కారాలను పూర్తి చేసిన మహేష్, ఇంకా ఆమెను తలుచుకుంటూ, ఆమె ఇంట్లోనే ఉన్నారు.
ఈ నేపథ్యంలో కృష్ణ గారిని, మహేష్ బాబును తెలంగాణా సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ స్వయంగా కలిసి వారిని పరామర్శించారు. ఇందిరాదేవి గారి చిత్రపటానికి నివాళిని అర్పించి, మహేష్ కుటుంబ సబ్యులకు సానుభూతిని ప్రకటించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa