తాను 2019లో ఎలాంటి ఎన్నికల్లో పోటీ చేయడం లేదని తమిళ నిర్మాతల మండలి ప్రెసిడెంట్, సినీ నటుడు విశాల్ స్పష్టం చేశారు. ఆదివారం తనని కలసిన మీడియాతో మాట్లాడుతూ నిర్మాతల మండలిలో నెలకొన్న విభేదాల కు తనని బలిచేయాలని కొందరు చూసారని, ఈ క్రమంలోనే తను పోలీసు అదుపులోకి వెళ్లేలా వ్యూహాత్మకంగా వ్యవహరించారని ఆగ్రహం వ్యక్తం చేసారు.తను గతంలో ఉప ఎన్నికల బరిలోకి దిగాలని చూసిన నేను 2019 పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేసే యోచనలో ఉన్నట్లు కొందరు నిర్మాతలు భావిస్తున్నారని, , తన ఎదుగుదలను అడ్డుకోవాలని చూస్తున్నారని చెప్పారన్నది స్పష్టంగా కనిపిస్తోందని వ్యాఖ్యానించారు.
తను తమిళనాడు నిర్మాతల మండలికి జరిగిన ఎన్నికలలో ప్రజాస్వామ్యబద్ధంగా అధ్యక్ష స్థానానికి పోటీ చేసి, సభ్యలందరి మద్దతుతో, మెజార్టీ ఓట్లు రావటం వల్లే ఆ పదవికి ఎన్నికయిన వ్యక్తినని తనని వ్యతిరేకిస్తున్న వ్యక్తులు గుర్తిస్తే మంచిదని విశాల్ వ్యాఖ్యానించారు.
తన గెలుపును జీర్ణించుకోలేని వాళ్లు తనను దెబ్బతీయడానికి గత కొంత కాలంగా చూస్తున్నారని, ఈ క్రమంలోనే టీఎఫ్పీసీ నిధులను దుర్వినియోగం చేశానంటూ ఆరోపణలు గుప్పించారని, కార్యాలయభవనానికి తాళాలు వెసారని అన్నారు. మండలి నిర్వహించిన ప్రతీ లావాదేవీకి బిల్లులు ఉన్నాయి, వచ్చిన ఆదాయం, ఖర్చులు అన్నీ పక్కాగా ఉన్నపుడు నెను ఎవరికి భయపడాలి అని ప్రశ్నించారు ఆయన. తమిళ సినీ పరిశ్రమ ఉన్నతికి తాను తీసుకుంటున్న నిర్ణయాలు కొందరికి నచ్చడం లేదని., అదే వారికి పెద్ద సమస్యగా తయారయినట్టుందని ఆయన వ్యాఖ్యానించారు. ప్రస్తుత సమస్యపై ఎంత దూరమైనా వెళ్లి పోరాటం చేయటానికి తను సిద్దంగా ఉన్నానని ఈ సందర్భంగా స్పష్టం చేసారు విశాల్.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa